కలకలం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్లో.. నీలిచిత్రాలు!
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్ చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైనది.
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్ చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైనది.
వివరాల్లోకి వెళితే.. కార్పొరేటర్లందరూ ఉన్న వాట్సప్ గ్రూప్లోకి హైదరాబాద్ లోని వెంగళరావునగర్ డివిజన్కు చెందిన కార్పొరేటర్ కిలారి మనోహర్ వాట్సాప్ నెంబర్ నుంచి నీలి చిత్రాలు అప్ లోడ్ అయినట్లు సమాచారం.
అధికారిక వాట్సప్ గ్రూప్లో నీలి చిత్రాలు రావడంతో శనివారం మహిళా కార్పొరేటర్లు మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే జీహెచ్ఎంసీకి చెందిన పెద్ద తలకాయలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదం పెద్దదవకుండా చూస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ పని తాను చేయలేదని, గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్.. తాను ఉద్యోగం నుంచి తీసివేశాననే పగతో తనను అప్రతిష్టపాలు చేయడానికి ఈ పనిచేసినట్లుగా కార్పొరేటర్ కిలారి మనోహర్ వాపోయినట్లు తెలిసింది.