డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఏసీపీ వీరంగం! (వీడియో)
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించకుండా వారిపై ఓ పోలీసు ఉన్నతాధికారి చిందులు తొక్కారు. తాను ఉన్నతాధికారినంటూ తమను తనిఖీ చేయవద్దని కేకలు వేశారు. దీంతో పోలీసు అధికారులు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సహా మరో ముగ్గురు మంగళవారం రాత్రి సఫారీ కారులో అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు.

వెంటనే తాగి డ్రైవింగ్ చేస్తున్న కారు డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపి తన సీటు నుంచి కిందకు దిగి వెనకాల సీటులోకి వెళ్లాడు. వెనకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది. వెనక సీట్లోని వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న పోలీసు అధికారులకు చెప్పారు. తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనుక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు.
అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని, తమ కారు వదిలేయాలని తనిఖీ చేస్తున్న పోలీసులను హెచ్చరించాడు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని వదిలేయాలని గట్టిగా కేకలు వేశాడు.దీంతో బ్రీత్ అనలైజర్ పరీక్షకు డ్రైవర్ మొండికేశాడు. మరోవైపు, ఊదొద్దని అతనికి ఏసీపీ సుమన్ కుమార్ అడ్డుపడ్డాడు. అంతటితో ఆగకుండా అక్కడ తనిఖీలు చేసే కానిస్టేబుల్ను ఏసీపీ సుమన్ కుమార్ తోసేశాడు.
#Telangana: Siddipet Traffic ACP Suman Kumar and businessman Jaipal Reddy were arrested by Madhura Nagar police after an alleged drunk driving incident and subsequent altercation with Sanjeeva Reddy Nagar traffic police. The ACP reportedly obstructed officers from conducting a… pic.twitter.com/9x8bOa8VFZ
— @Coreena Enet Suares (@CoreenaSuares2) November 13, 2024
కారు బానెట్ పై గుద్దుతూ దూషిస్తూ, హల్చల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు సుమన్ కుమార్. దీంతో ట్రాఫిక్ పోలీసులు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది.
మోతాదుకు మించి 39 పాయింట్లుగా నమోదైంది.
Siddipet Traffic @acpsiddipet Suman & businessman Jaipal Reddy were arrested by @MadhuraNagar Police after an alleged drunk driving incident & subsequent altercation with @shotr_srnagar The ACP reportedly obstructed officers from conducting a breathalyzer test on the driver. pic.twitter.com/fqw1Dt4UbG
— MD MOUZAM ALI (@Mouzam_Ali_) November 14, 2024
డ్రైవింగ్ చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, అతడు అల్వాల్కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డి, వారితో పాటు ఉన్న శ్రీనివాస్, వెంకట్ రావులపై ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్సై కాంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారందరినీ అరెస్ట్ చేసినట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. కాగా, ఏసీపీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు అధికారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పోలీసు అధికారి అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications