సింగరేణికి కేసీఆర్ భారీ నజరానా: దసరా, దీపావళికి రూ.82 వేలు
సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
కార్మికులకు దసరా, దీపావళి కానుకను బుధవారం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి దసరా, దీపావళి బోనస్గా రూ.82వేలు రానున్నాయి.

దసరా బోనస్ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీపావళి బోనస్ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు పెంచింది. దసరా బోనస్ అడ్వాన్స్ను ఈ నెల 22వ తేదీన, దీపావళి బోనస్ అడ్వాన్స్ను అక్టోబర్ రెండో వారంలో కార్మికుల ఖాతాలో వేయనున్నారు.












Click it and Unblock the Notifications