స్నేక్ గ్యాంగ్ కేసు: సిఐకి హైకోర్టు సమన్లు
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసులో హైకోర్టు శుక్రవారం హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ సిఐకి సమన్లు జారీ చేసింది. స్నేక్ గ్యాంగ్ సభ్యుడిగా తలేబ్ బిన్ మొహమ్మద్ దయానీని నిర్బంధించడానికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణపై ఈ నెల 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని హైకోర్టు సిఐకి సమన్లు జారీ చేసింది.
తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ దయానీ తల్లి సోఘ్రా హుస్సేన్ దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన హైకోర్టు బెంచ్ ఆ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు పెద్ద యెత్తున రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని ఎర్రకుంటలో గల తమ ఇంటిపై గతవారం పోలీసులు దాడి చేసి తన కుమారుడిని తీసుకుని వెళ్లారని దయానీ తల్లి ఆరోపించారు. తన కుమారుడిని వెంటనే విడుదల చేయించాలని ఆమె కోరారు.
అక్రమ నిర్బంధం తన కుమారుడి కెరీర్ను దెబ్బ తీస్తుందని, అందుకు హోం కార్యదర్శి నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె అన్నారు. ఆమె పిటిషన్లో చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు అంతకు ముందు సిఐని ఆదేశించింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ నెల 9వ తేదీ తమ ముందు హాజరు కావాలని హైకోర్టు సిఐని ఆదేశించింది.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications