సౌత్ ఈస్టర్న్ రైల్వేను కబడ్డీ ఆడేసిన దక్షిణ మధ్య రైల్వే.. తగ్గేదేలే!
ప్రజల రైలు రవాణా సౌకర్యాన్ని మెరుగుగా అందించేందుకు రైల్వే ఉద్యోగులు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. భారతీయ రైల్వేలు, రైల్వే ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యం కోసం, వారి సురక్షిత ప్రయాణం కోసం నిత్యం శ్రమిస్తారు. ఏ ఒక్క ఉద్యోగి కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, రైల్వే ఉద్యోగులు విధినిర్వహణలో అకుంఠిత దీక్షతో పనిచేస్తారు.
47వ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్
ఎప్పుడూ అలెర్ట్ గా ఉంటూ విధులు చేసే రైల్వే ఉద్యోగులు అప్పుడప్పుడు ఆటవిడుపు కోసం, ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రైల్వేలో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇటీవల సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో 47వ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ జరిగింది. అక్టోబర్ ఏడవ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ ఛాంపియన్షిప్ హోరాహోరీగా నిర్వహించారు.

రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ ను నిర్వహించింది. ఈ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా కబడ్డీ టీం ఈ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది.
In the Final match, #SouthCentralRailway team beat South Eastern Railway by 25-19 and won the 47th All India #Kabaddi (Womens) #Championship today at Railway Sports Complex, Secunderabad. Integral Coach Factory, Chennai stood at 3rd place. #WomenKabbadi pic.twitter.com/eSDKqJs8MW
— South Central Railway (@SCRailwayIndia) October 10, 2025
దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు విజేతలు
సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు సౌత్ ఈస్టర్న్ రైల్వే ను ఓడించి 47వ ఆల్ ఇండియా రైల్వే మహిళా కబడ్డీ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే మహిళా టీం పై బరిలోకి దిగిన సౌత్ సెంట్రల్ రైల్వే కబడ్డీ జట్టు ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
సౌత్ ఈస్ట్రన్ రైల్వే ని వెనక్కు నెట్టిన సౌత్ సెంట్రల్ రైల్వే
ఈ పోటీలో చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జట్టు 3వ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో విజేతలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. క్రీడలు మహిళల శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, వారికి కావలసిన ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. ఈ రైల్వే ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై దక్షిణ మధ్య రైల్వే మహిళా జట్టుకు ఛాంపియన్ షిప్ ట్రోఫీ అందజేశారు. మొత్తానికి సౌత్ ఈస్ట్రన్ రైల్వే ని వెనక్కు నెట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ చాంపియన్ షిప్ లో తిరుగులేని విజయాన్ని సాధించింది.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications