హృదయ విదారకం: ఫ్యామిలీపైకి దూసుకొచ్చిన ఆటో, చిన్నారి మృతి(వీడియో)
హైదరాబాద్: నగరంలోని (ఉప్పల్)రామంతాపుర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంతో ఆటో నడిపిన ఓ డ్రైవర్.. అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణం తీశాడు.
గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ముగ్గురు మృతి, అతివేగమే కారణం
తల్లి, తండ్రితో కలిసి సరదాగా నడుచుకుంటున్న వెళ్తున్న ఆ చిన్నారిని వేగంగా దూసుకొచ్చిన ఆటో డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఉమేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కిరాణ షాప్కు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఉమేశ్ కుమారుడు మోహిత్ (5)ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఉమేశ్ దంపతులు, కూతురు ఈ ప్రమాద ఘటనలో గాయాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
A drunken driving accident caught on cam in Uppal area in #Hyderabad. A speeding auto mowed down a family of four. A 5-yr-old lost his life and was declared brought dead in this accident. #DriveSafe #DontDrinkAndDrive pic.twitter.com/xezDhd9pEa
— Paul Oommen (@Paul_Oommen) September 10, 2018
అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆర్తనాదాలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
కాగా, ప్రమాద స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో, వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా, రోడ్లు ఇరుకుగా ఉన్నప్పటికీ దుకాణదారులు ఫుట్పాత్ ఆక్రమణలకు పాల్పడుతుండటం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.