వైఎస్ జగన్ ఆస్తుల కేసులో శ్రీనివాసన్కు ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షు వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు కొంత ఊరట లభించింది. దిగువ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మంగళవారం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
ఆక్రమాస్తుల కేసులో తనను నిందితుడిగా సిబిఐ పేర్కొనడాన్ని కొట్టివేయాలని, సిబిఐ కోర్టులో హాజరుకు మినహాయింపు నివ్వాలని కోరుతూ హైకోర్టులో శ్రీనివాసన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ బీ శివశంకర్రావు ఆధ్వర్యంలోని న్యాయస్థానం విచారణ చేపట్టింది.
కోర్టు విచారణకు శ్రీనివాసన్ హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లను కొట్టివేయాలంటూ ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీనివాసన్ హైకోర్టులో ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను పరిశీలించకుండానే జగన్కు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడుల పెట్టి తాను లబ్ధి పొందినట్లు సీబీఐ అధికారులు కేసును నమోదు చేశారని ఆయన పిటిషన్లో అన్నారు.
తనకు ఇండియా సిమెంట్స్ కంపెనీ ఉందని జగన్కు భారతి సిమెంట్స్ కంపెనీ ఉండేదని శ్రీనివాసన్ వివరించాడు. ఒకే రకమైనా వ్యాపారాలు చేసే సమయంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండటం వ్యాపార లక్షణమన్నారు. తాను జగన్ సంస్థలలో రూ.140 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ పేర్కోనడం సరికాదన్నారు. నామమాత్రపు పెట్టుబడులు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యంగా జగన్కు సంస్థలలో పెట్టిన పెట్టుబడులన్ని క్విడ్ ప్రోకోకు చెందినవన్న వాదనను ఆయన వ్యతిరేకించారు.
వ్యాపారపరమైన పెట్టుబడులు ఉంటాయని వివరించాడు. అంతే కాక తాను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని కోర్టుకు వివరించాడు. కావున తన పేరును జగన్ ఆస్తుల కేసు నుంచి తొలగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
-
కవితకు సీబీఐ షాక్! లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications