టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ కలకలం: వాట్సప్లో చేరవేత, టీచర్లే నిందితులు
హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎనిమిది రోజుల్లో ఐదు పేపర్లు లీకవడం గమనార్హం.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన 10వ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఇప్పుడు నిర్మల్, వనపర్తి, జగిత్యాల జిల్లాలకు పాకింది. వాట్సప్ ద్వారా పరీక్ష పేపర్లను లీక్ చేస్తున్నారు నిందితులు.

పరీక్ష పేపర్ల లీకేజీలో పాత నేరస్తుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 16మందిపై కేసులు నమోదు చేశారు. నిర్మల్లో పేపర్ లీక్ చేసిన మన్మథ రెడ్డి అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. కాగా, అతడు పరారీలో ఉన్నాడు.
నిందితులు ప్రశ్నాపత్రంతోపాటు జవాబులను కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని పంపిస్తుండటం గమనార్హం. తమ స్కూళ్లకు ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంతోనే కొందరు టీచర్లు ఈ లీకేజీలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications