ఆహారంలో బల్లి: బాలిక హాస్టల్లో 33 మందికి అస్వస్థత, ఆందోళనకరంగా 11 మంది పరిస్థితి
వరంగల్: రాష్ట్రంలో కలుషితాహారం బారినపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, సోమవారం వరంగల్ జిల్లా వర్దన్నపేటలోని గర్ల్స్ హాస్టల్లో 30 మందికిపైగా విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహంలో సోమవారం రాత్రి భోజనంలో బల్లి వచ్చిందని ఓ విద్యార్థిని గుర్తించి మిగితా విద్యార్థులకు చెప్పింది. దీంతో వెంటనే మిగితా విద్యార్థులు తినడం ఆపేశారు.
అయితే, కొంత సమయం తర్వాత ఆ ఆహారం తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది. మొత్తం 33 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 33 మందిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఇటీవల ఇలాంటి ఘటనలు పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. వర్దన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు నిత్యకృత్యంగా మారడం పేదల ప్రాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications