హైదరాబాద్లో సుబ్రతా రాయ్: ఇన్వెస్టర్లు, స్టేక్ హోల్డర్లతో భేటీ
హైదరాబాద్: సహారా పరివార్ అధినేత సుబ్రతా రాయ్ శుక్రవారం హైదరాబాద్లోని సంస్థకు చెందిన ఇన్వెస్టర్లు, వినియోగదారులు, ఇతర స్టేక్ హోల్డర్లతో సమావేశం కానున్నారు. అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో అరెస్టయిన రాయ్.. కొద్ది రోజుల క్రితం పెరోల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
సుబ్రతా రాయ్ తల్లి చబ్బీ రాయ్ మరణించటంతో ఉత్తర క్రియలతో పాటు ఇతర కర్మల్లో పాల్గొనేందుకు ఆయనకు సుప్రీం కోర్టు పెరోల్ మంజూరు చేసింది. జూలై 11 వరకు ఈయన పెరోల్పై ఉండనున్నారు. హైదరాబాద్కు సుబ్రతా వస్తున్న విషయాన్ని సహారా వర్గాలు ధృవీకరించాయి.

దాదాపు మూడు నాలుగు వేల మంది సహారా పరివార్కు చెందిన ఉద్యోగులు, కస్టమర్లు, ఇతర వాటాదారులను ఆయనను కలుసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రైవేట్గా నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది.
కోర్టు కేసుల కారణంగా సుబ్రతా రాయ్ మీడియాను కలుసుకోవడానికి సుముఖంగా లేరని సహారా పరివార్ వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాదులో సహారా గ్రూప్ నకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో పాటు డిపాజిటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు












Click it and Unblock the Notifications