ప్రేమ వేధింపులకు మరో యువతి బలి
వరంగల్ :ప్రేమ పేరుతో యువకుడి వేదింపులకు ఓ విధ్యార్థి ఆత్మహాత్య చేసుకొంది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం దేశిరాజుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ప్రేమ పేరుతో ఇంటర్ విధ్యార్థిని శివానిని శ్రీకాంత్, గణేష్ లు వేదిస్తున్నారు.సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీకి వెళ్ళే శివానీని ఈ ఇద్దరూ యువకులు వేధింపులకు గురిచేస్తున్నారు.ఈ ఇద్దరు యువకుల వేదింపుల విషయాన్ని ఆమె తన సోదరుడు కుమార్ కు తెలిపింది.కుమార్ ద్వారా శివాని తల్లిదండ్రులకు కూడ సమాచారం తెలిసింది.
శివానీని వేదిస్తోన్న విషయాన్ని ప్రశ్నించిన కుమార్ ను పోకిరీలు బెదిరించారు. అంతేకాదు పోకిరీల వేదింపులు మరింత అధికమయ్యాయి.కాలేజీకి వెళ్ళాలంటే శివాని భయపడే పరిస్థితికి వచ్చింది.
పోకిరీల వేదింపులను తట్టుకోలేక మనస్థాపానికి గురైన శివానీ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొంది.శివానీ ఆత్మహత్యకు పోకిరీల వేదింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.