"కాంగ్రెస్ టీడీపీ సిగ్గుచేటు రాజకీయం ; రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదు"
హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్ రావు తీరును తప్పుబడుతోన్న ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి. తెలంగాణను కోటి ఎకరాల మాగణగా తీర్చిదిద్దాలని తపిస్తోన్న హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.
పనిచేసే మంత్రులపై విమర్శలు చేస్తూ పోతే సహించేది లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధాకర్ రెడ్డి. మిడ్ మానేరుకు గండిపడిన ఉదంతాన్ని కూడా కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. మిడ్ మానేరుకు గండిపడితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు.

ఇక కొత్త జిల్లాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. సిరిసిల్లను జిల్లా చేయాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పబట్టారు సుధాకర్ రెడ్డి. కొత్త జిల్లాలు ప్రజా అవసరార్థమే తప్పితే.. పార్టీలు, నేతల సౌలభ్యం కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వివాదస్పదం చేయడం కాంగ్రెస్, టీడీపీలకు అలవాటుగా మారిపోయిందని ఆరోపించారాయన.
రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదు : పొంగులేటి
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ మార్క్ పాలనా కొనసాగుతోందని, భద్రాచలం మునిగిపోయే ప్రమాదమున్నా.. పోలవరంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications