వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్లను పీఏలుగా నియమించొద్దు: తెలంగాణకు సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఉపాధ్యాయులను మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగత సహాయకులు(పీఏ)గా నియమించొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. డిప్యుటేషన్‌పై పీఏలుగా పనిచేస్తున్న వారిని వెనక్కు పిలవాలని స్పష్టం చేసింది.

తెలంగాణలో 'జీరో స్కూల్స్'పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అమికస్ క్యురీ అందజేసింది.

Supreme court asks Telangana government on Schools situation

ఎంఈవో, డీఈవో పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని అడిగింది.

అంతేగాక, అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

English summary
Supreme court asked Telangana government to submit a report on Schools situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X