బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం సంచలన నిర్ణయం, ఎన్నికలపై కీలక ఆదేశం..!!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్ల పై హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి రిజర్వేషన్ల ఖరారు ఏ విధంగా చేసిందీ వివరించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన అంశంతో పాటుగా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాన్ని కోర్టుకు నివేదించారు. వాదనల తరువాత సుప్రీంకోర్టు పిటీషన్ ను కొట్టివేస్తూ.. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టు లో వాదనలు జరిగాయి. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో రిజర్వేషన్ల అమలు...స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం, పీసీసీ నేతలు పలుమార్లు ప్రకటించారు. దీంతో, ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం తెలంగాణ కేబినెట్ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెష ల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) గురువారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ కోర్టుకు వివరించారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై 50 శాత పరిమితి లేదని, గతంలో సుప్రీంకోర్టు కేవలం ఒక మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొన్నారు. అయినా, హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రిజర్వేన్లకు అనుకూలంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని సింఘ్వీ కోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాగా, నిర్ణయం గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న అంశాన్ని సుప్రీం ప్రస్తావించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే గత తీర్పులను ప్రతివాది లాయర్లు కోర్టుకు వివరించారు. దీంతో, వాదనల తరువాత సుప్రీంకోర్టు పిటీషన్ ను కొట్టివేస్తూ.. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications