'తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ పని చూసుకోక.. మాపై కామెంట్ చేస్తారా'
జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి తన పనుల తాను చూసుకొని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్లు చేయడం ఏమిటని టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి తన పనుల తాను చూసుకొని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్లు చేయడం ఏమిటని టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
అసెంబ్లీకి పనుల కోసం వచ్చిన జేసీ వచ్చిన పని చూసుకోకుండా తమ పార్టీ పైన కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఆయన తమ పార్టీ వ్యక్తి కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఆయనకు తమ పార్టీతో పని ఏముందన్నారు.

బట్ట కాల్చి మీద వేస్తారా అని నిలదీశారు. ఆయనకు మర్యాద ఏమైనా ఉందా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి అందులోనే బతుకుతున్న వాళ్లమని, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిపోతే కడుపు కాలిపోతోందన్నారు.
కాగా, రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుకోకుండా అన్యాయం చేశారని, అడవుల పాలు చేశారని, విభజన తర్వాత తాము తెలంగాణతో కలిసి ఉంటే, తాగటానికి ఇన్ని నీళ్లు, తినటానికి ఇంత తిండి దొరికేదని, కానీ కుదరలేదని, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ రెడ్లే అడ్డుపడ్డారని జేసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో కష్టమేనని తాను అప్పుడే చెప్పానని కూడా అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications