చెప్పా, నువ్వే డిసైడ్ చేసి రాస్కో: ఆంధ్రజ్యోతిపై తలసాని రుసరుస
హైదరాబాద్: ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారని మీడియా ప్రతినిధి పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు రుసరుసలాడారు. తాను ప్రభుత్వంలో ఉన్నానని, ఏ పార్టీలో ఉన్నానో నీవే డిసైడ్ చేసుకొని రాసుకోమని సలహా ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి పత్రిక పైన పేరు పెట్టి వ్యాఖ్యలు చేశారు. రాసేస్తాం, ఏదో బట్టకాల్చి మీదేస్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతికి అన్నీ అట్లే కనిపిస్తాయన్నారు. అన్ని తేడాగా కనిపిస్తాయని, మీకు వచ్చే ఆలోచనలు వేరే వారికి రావని మండిపడ్డారు.

తలసాని మంగళవారం మాట్లాడుతూ.. తాను ఒక్కసారి కాదని, వందసార్లు చెబుతున్నానని రాజీనామా చేశానని చెప్పారు. తాను రెండు రోజులు రాజకీయాలు కాదనుకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసన్నారు. తాను అందరి బండారం బయటపెడతానన్నారు.
ఎర్రబెల్లి దయాకర రావు రాజీనామా చేద్దాం రా అన్నారు. ఎర్రబెల్లి గెలిస్తే తాను రాజకీయాలు మానుకుంటానని సవాల్ చేశారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఏనాడో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన రాజీనామా లేఖ కాపీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నానన్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications