ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదారు (ఫోటోలు)
నిజామాబాద్: జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైఖరిని నిరిసిస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో వారు నిరసన దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో కోపంతో టీడీపీ కార్యకర్తలు వారిని కోపంతో చితకబాదారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
కిందికి వెళ్లగానే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు చెందిన వాహనం అద్దాల ను ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్రమణ, ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు హాజరయ్యారు.
టీడీపీ సమావేశాన్ని అడ్డుకొని దాడికి పాల్పడడమే కాకుండా ధ్వంసం చేసిన ఆరుగురు ఎమ్మార్పీఎస్ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగిందని నాలుగో టౌన్ ఎస్ఐ మధు తెలిపారు. నగరంలోని శివాజీనగర్లోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా వాహనం, ఫర్నీచర్ ధ్వంసం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు సి. నాగభూషణం, ఎం. బాలు, ఎస్. కృష్ణ, పి. శ్రీనివాస్, ఎ. సంతోష్, ఎల్. భూమయ్యను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైఖరిని నిరిసిస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో వారు నిరసన దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
దీంతో కోపంతో టీడీపీ కార్యకర్తలు వారిని కోపంతో చితకబాదారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
టీడీపీ సమావేశాన్ని అడ్డుకొని దాడికి పాల్పడడమే కాకుండా ధ్వంసం చేసిన ఆరుగురు ఎమ్మార్పీఎస్ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగిందని నాలుగో టౌన్ ఎస్ఐ మధు తెలిపారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
నగరంలోని శివాజీనగర్లోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా వాహనం, ఫర్నీచర్ ధ్వంసం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు సి. నాగభూషణం, ఎం. బాలు, ఎస్. కృష్ణ, పి. శ్రీనివాస్, ఎ. సంతోష్, ఎల్. భూమయ్యను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్రమణ, ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు హాజరయ్యారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్ని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
కిందికి వెళ్లగానే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు చెందిన వాహనం అద్దాల ను ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.