హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్యాలయ భవనంపై నుంచి దూకి టెక్‌మహీంద్ర ఉద్యోగిని ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ గోపాల్‌పురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన కార్యాలయ భవనంపై నుంచి దూకి సుష్మిత(21) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్ మహీంద్ర సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన యువతి తన కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

tech mahindra lady employee commits suicide in hyderabad

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

చేగుంట మండలం వడియారంలో సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోపాటు వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు.

Recommended Video

H-1B Visa New Rules: Indian Techies చావుకొచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు| US Presidential Elections

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గయ్య(26) ఎలాంటి పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. వివాహం కాకపోవడంతో నిరాశలో ఉండేవాడు. మంగళవారం ఇంట్లోనుంచి బయలుదేరి వడియారం వద్ద రాత్రి సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో ఆయన కుటుండంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
tech mahindra lady employee commits suicide in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X