షాక్: సుఖంగా చచ్చిపోవాలని, గూగుల్లో వెతికి టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుఖంగా చచ్చిపోవాలనే ఉద్దేశ్యంతో నైట్రోజన్ గ్యాస్తో యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. సుఖంగా చచ్చిపోవడం కోసం అతను ఏకంగా గూగుల్లో వెతికి మరీ సూసైడ్ చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న ఆ టెక్కీ లక్కీ. ఏదైనా సాధించాలకున్నాడు. కానీ ఫలితం దక్కలేదు. ప్రయత్నాలు విఫలమవుతున్నాయని సుఖంగా చనిపోవాలనుకున్నాడు. సాధారణ పద్ధతిలో ఆత్మహత్య చేసుకోకుండా నొప్పి లేకుండా మరణించాలనుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా సునాయాసంగా చనిపోయే మార్గాలపై శోధన చేశాడు.
అందులో నైట్రోజన్ గ్యాస్తో త్వరగా చనిపోతారని తెలుసుకొని ఆ పద్ధతిని పాటించి తనువు చాలించాడు. బుధవారం నాడు హైదరాబాద్లో వెలుగు చూసిన టెకీ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ఎస్సార్ నగర్లో ఉంటున్న అశోక్ కుమారుడు లక్కీ (32), వాట్సాప్ కంటే మెరుగైన సాఫ్ట్వేర్ను కనుగొనేందుకు తీవ్రమైన పరిశోధనలు చేశాడు.

కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్న లక్కీ అనేక యంత్రాలు కొనుగోలు చేశాడు. ఇందుకు భారీగా ఖర్చు చేశాడు. కానీ పరిశోధనలు విఫలమయ్యాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యాడు. నెల రోజులుగా అన్యమనస్కంగా ఉంటూ గదిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
బాథతో ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. బాధ లేకుండా చనిపోవాలని భావించి నైట్రోజన్ గ్యాస్ ద్వారా అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చనిపోవచ్చని నిర్ధారించుకున్నాడు. మార్చి 17వ తేదీన రూ.5వేలు డిపాజిట్ చేసి బాలానగర్లోని ఓ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్ను అద్దెకు తెచ్చుకున్నాడు.
ముఖానికి ప్లాస్టిక్ కవర్ను చుట్టుకొని దాంట్లోకి నైట్రోజన్ గ్యాస్ను పంప్ చేసుకున్నాడు. దీంతో ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడని తెలుస్తోంది. మంగళవారం రాత్రి పదకొండు గంటలకు గదిలోకి వెళ్లిన లక్కీ, బుధవారం సాయంత్రం 3 గంటలు దాటినా బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూస్తే విగత జీవిగా పడి ఉన్నాడు.
లక్కీ సూసైడ్ నోట్ రాశాడు. నైట్రోజన్ గ్యాస్తో చనిపోవడం సులభతరమని నెట్లో ఉందని అందులో పోలీసులను ఉద్దేశించి పేర్కొన్నాడు. 'నేను లక్కీ. నా జీవితాన్ని ముగిస్తున్నాను. ఎవరూ బాధపడొద్దు. ప్రశాంతంగా ఉండాలం'టూ రాశాడు. ఏప్రిల్ 20వ తేదీ (బుధవారం) తెల్లవారుజామున 4.30 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
అంతకుముందు తెల్లవారుజామున 3.48, 4.01 గంటలకు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు సమయాలను రాసి పెట్టి తిరిగి కొట్టేశాడు. సిలెండర్ డబ్బులు తాను చెల్లించానని, అయితే ఇందుకు సంబంధించిన డిపాజిట్ నగదును సదరు కంపెనీ నుంచి తిరిగి తీసుకోవాలని లక్కీ కాఛాైం. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications