హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: హాట్‌స్పాట్‌గా ఆ నాలుగు జిల్లాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ ఆరంభంలో తొలుత 500 లోపు.. ఆ తరువాత వెయ్యిలోపు నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు మరింత జోరందుకున్నాయి.నాలుగంకెలను దాటేశాయి. యాక్టివ్ కేసుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు ఎనిమిది వేలకు చేరవ అయ్యాయి. ఈ పరిణామాల మధ్య డిశ్చార్జీల సంఖ్య మెరుగుపడుతోంది. ఇప్పటిదాకా మూడు లక్షల మందికి పైగా పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,321 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయిదుమంది మరణించారు. 293 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,12,140కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,02,500 మంది ఉన్నారు. 1,717 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 7,923 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 3,866 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Telangana: 1321 Covid19 positive cases and and 5 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 320 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నిజామాబాద్‌లల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. కరోనా హాట్‌స్పాట్‌గా మారాయి. ఆదిలాబాద్-30, భద్రాద్రి కొత్తగూడెం-6, జగిత్యాల-46, జనగామ-13, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-6, కామారెడ్డి-15, కరీంనగర్-41, ఖమ్మం-23, కొమరం భీమ్ ఆసిఫాబాద్-11, మహబూబ్‌నగర్-30, మహబూబాబాద్-13, మంచిర్యాల-24, మెదక్-14, మేడ్చల్ మల్కాజ్‌గిరి-144, ములుగు-2, నాగర్ కర్నూల్-14, నల్లగొండ-28, నారాయణ్‌పేట్-11, నిర్మల్-64, నిజామాబాద్-96, పెద్దపల్లి-14, రాజన్న సిరిసిల్ల-35, రంగారెడ్డి-121, సంగారెడ్డి-49, సిద్ధిపేట్-23, సూర్యాపేట్-19, వికారాబాాద్-15, వనపర్తి-10, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-43, యాదాద్రి భువనగిరి-21 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 62,973 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 53,960 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,03,92,927గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,79,229 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

English summary
Newly 1,321 Covid-19 Coronavirus Positive cases and five deaths have been reported in Telangana in past 24 hours. 293 Patients were discharged at the same time. Total positive cases is reached at 3,12,140 and 1,717 deaths were registered in the Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X