Telangana budget: గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణా బడ్జెట్..ఏం జరుగుతోంది?
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఆరంభం కానున్నాయి. ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఏపీలో ఈ నెల 11వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. తెలంగాణలో తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశమౌతుంది. అసెంబ్లీని ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనేది ఖరారు చేస్తుంది. రెండు వారాల పాటు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. బడ్జెట్ అవుట్ లే 2,50,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకోసం..













Click it and Unblock the Notifications