తెలంగాణలో మహిళలకు రూ.2,500, పింఛన్ల పెంపు - ముహూర్తం ఫిక్స్..!!
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు, పెండింగ్ లో ఉన్న రెండు పథకాలను అమలుకు సిద్దమవుతున్నారు. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది.

ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
పెండింగ్ హామీల అమలుకు నిధుల కేటాయింపు
అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తి కానుండటంతో... ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 2, 500 .. అదే విధంగా పెన్షన్ రూ 4,000 కు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా.. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక, ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది.
ఈ కేబినెట్లో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాల అమలు పైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఆర్దిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా మూడు కార్పోరేషన్లు గా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications