బుల్డోజర్లతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసే అభ్యర్థులు భారీ ర్యాలీగా రావడం సాధారణమే. కానీ, పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మాత్రం వినూత్నంగా ర్యాలీ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. నామినేషన్ సందర్భంగా ఆయన ఏకంగా బుల్డోజర్ల(జేసీబీ)తో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాలకు బుల్డోజర్లకు విడదీయని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించడం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్క్ పాలనకు చిహ్నంగా మారిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు బుల్డోజర్ పాలన తీసుకొస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బీజేపీలో బుల్డోజర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది.

ఈ నేపథ్యంలోనే పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తన నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బుల్డోజర్లతో ర్యాలీ నిర్వహించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ ర్యాలీ పటాన్చెరులో చర్చనీయాంశంగా మారింది. పటాన్ చెరులో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
9th November— Packed with nominations- seems to be a good day for many politicians.
— Poola Santosh (@santosh_poola) November 9, 2023
BJP Pantancheru Candidate Nandishwar Goud takes out a Bulldozer rally to file his nomination@GThouti @ThoutiAshish pic.twitter.com/gEr5y5cJJy
బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) గురువారం విడుదల చేసింది. ఇప్టపికే మూడు విడతల్లో అభ్యర్థులను బీజేపీ.. నేటి సాయంత్రం నాలుగో జాబితాను విడుదల చేసింది. టికెట్ ఖరారైన అభ్యర్థులకు బీజేపీ కీలక నేతలు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం అందించారు.
On the auspicious 9th of November, BJP's Pantancheru candidate, Nandishwar Goud, makes a bold statement, filing his nomination in a unique style with a rally featuring a bulldozer. #ElectionNomination #BJPContestant
— The Identifier7 (@princzlee) November 9, 2023
pic.twitter.com/SNoECFE1Ra
కంటోన్మెంట్ స్థానం నుంచి కృష్ణప్రసాద్, నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్, మేడ్చల్ నుంచి రామచంద్రరావు, పెద్దపల్లి స్థానం నుంచి ప్రదీప్ కుమార్, సంగారెడ్డి స్థానం నుంచి పులిమామిడి రాజుకు టికెట్ కేటాయించినట్లు బీజేపీ ఓ ప్రకటనలతో తెలిపింది. మొత్తం నాలుగు విడతల్లో వంద స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 8 స్థానాలకు జనసేనకు కేటాయించింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఇప్పటికే అవకాశం ఇచ్చారని.. బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications