Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ మృతిపై వార్తాకథనం: జగన్ చానల్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు

హైదరాబాద్‌: దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి వెనుక రిలయెన్స్ హస్తం ఉందంటూ వార్తా కథనాలను ప్రసారం చేసి, ఆ సంస్థ ఆస్తుల నష్టానికి కారణమైందనే ఆరోపణలపై జగన్‌ చానల్‌ను ప్రాసిక్యూట్‌ చేయాల్సిందేనని తెలంగాణ సీఐడీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

వైయస్ మృతి వెనుక రిలయన్స్‌ హస్తం ఉందంటూ వైఎస్‌ మరణించిన కొద్ది నెలలకు జగన్‌ టీవీ సహా టీవీ-5, ఎన్‌టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ అభిమానులు రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ మూడు టీవీ చానళ్లపై 153-ఏ(దేశద్రోహం) కింద కేసు నమోదు చేసింది.

YS Jagan

ఈ కేసును సీఐడీ దర్యాప్తునకు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీ ఈ బాధ్యతలు చేపట్టింది. వైఎస్‌ అభిమానులు ధ్వంసం చేసిన రిలయన్స్‌ ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా సీఐడీ విభాగం అంచనా వేసింది. అయితే... తెలంగాణలో కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీవీ-5, ఎన్‌టీవీ చానళ్లు తమను ఆ కేసు విచారణ నుంచి తప్పించాలని కోరుతూ లేఖలు రాశాయి.

జగన్‌ టీవీలో వచ్చిన కథనాల ఆధారంగానే తమ చానళ్లలో కథనాలు ప్రసారం చేశామని, జగన్‌ టీవీ కథనాలు నిజమో? కాదో? నిర్ధారించుకోకుండా వేయడం తప్పేనంటూ క్షమాపణలు చెప్పాయి. దీంతో ఆ రెండు చానళ్లను కేసు విచారణ నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇది జరిగిన తర్వాత జగన్‌ టీవీ కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది.

దేశద్రోహం కేసు నుంచి తమను తప్పించాలని కోరింది. అయితే, ఆ కేసు వ్యవహారాలు చూస్తున్న తెలంగాణ సీఐడీ విభాగం ఇందుకు అంగీకరించలేదు. దేశద్రోహం కేసు నుంచి తప్పించడం కుదరదని కేసీఆర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్‌ టీవీ సీఈవో, ఎడిటర్‌, ఇద్దరు జర్నలిస్టులు నిందితులుగా ఉన్నారని సీఐడీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+