కలెక్టర్లతో కెసిఆర్ సమావేశం
హైదరాబాద్: సంక్షేమరంగంలో రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతూ నంబర్ వన్ గా నిలిచామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కావడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలన్నారు. సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టడం అసాధ్యం కాదన్నారు. ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం ఉందన్నారు. కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు. మంచి పాలసీలు, పథకాలు రావాలి, అవి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications