ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ: 20నిమిషాలపాటు కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ ముగిసింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి.
విభజన చట్టం హామీలతో పాటు రక్షణశాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయం, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజనతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరు చేయాలని కోరినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ తన నివాసానికి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications