బెజవాడ దుర్గమ్మకు తీర్చే మొక్కు ఇదే: కొండపై 'కేసీఆర్' నినాదాలు, వద్దన్న సెక్యూరిటీ
Recommended Video

విజయవాడ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావులు స్వాగతం పలుకుతారు.
కేసీఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి వెటర్నరీ కళాశాల అతిథి గృహంకు చేరుకుంటారు. ఆ తర్వాత దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరుతారు. అక్కడ అమ్మ వారికి ముక్కుపుడక సమర్పించుకుంటారు. కేసీఆర్ రాక కోసం విజయవాడలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కేసీఆర్ కాన్వాయ్ కోసం 15 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు.
కాగా, ఆయన రావడానికి ముందే కేసీఆర్ జిందాబాద్ అంటూ ఇంద్రకీలాద్రిపై అభిమానులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ జెండా, ఫ్లెక్సీలతో కొండపైకి వచ్చారు. అయితే కొండపై రాజకీయ నినాదాలు చేయవద్దని భద్రతా సిబ్బంది వారించింది. ఫ్లెక్సీలు తొలగించాలని దుర్గగుడి భద్రతా సిబ్బంది సూచించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications