రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...
పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.
అనంతరం రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం పరీశీలించారు. ఈసంధర్భంగా అధికారులు ప్లాంట్ పనుల పురోగతిని సీంకు వివరించారు. ప్లాంట్ పరీశీలన తర్వాత ఎన్టీపీసీ ,జెన్కో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.శనివారం రాత్రీ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో బస చేస్తారు.

కేసీఆర్ రెండురోజులపాటు జిల్లాల పర్యటన
కాగా రెండు రోజుల పాటు పెద్దపల్లి,తోపాటు భూపాలపల్లి జిల్లాలోని జిల్లాలో పర్యటించనున్న సీఎం మొదటిరోజు ఎన్టీపీసీలో పర్యటన ముగించుకున్న తర్వాత ఆదివారం ఉదయం జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాకు బయలుదేరి వెళతారు. జిల్లాలోని కాలేశ్వరం దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అనంతరం కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం జరుగుతున్న కన్నేపల్లి పంపుహౌజ్,తోపాటు మేడీగడ్డ బ్యారేజీ పనులను కేసీఆర్ పరిశీలిస్తారు.

రామగుండం విద్యుత్ ప్లాంట్ పనుల పరీశీలన..
ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వీభన చట్టంలో భాగంగా తెలంగాణలోని రామగుండంలోని ఎన్టీపీసీలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే తొలివిడతలో రూ. 10 వేల, 598 కోట్ల నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులను ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 2016లో ప్రారంభించారు. కాగ ఈ విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.కాగా ఈపవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి రెండు టీఎంసీల నీళ్లను కేటాయించారు.ఒడిశా నుండి బోగ్గును సరఫరా చేస్తారు.

ఆదివారం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల పరీశీలన
ఆదివారం ఉదయం కాలేశ్వం చేరుకోకున్న ఆయన ఉత్తరతెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి మరోసారీ పరీశీలిస్తారు.కాగా ప్రాజెక్టు చేపట్టినప్పటి నుండి మూడోసారీ ప్రాజెక్టుపనులను సందర్శించారు. కాగా మేడిగడ్డ ,బ్యారేజీ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు అంకితం ఇవ్వడంతోపాటు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున మొత్తం రాష్ట్ర్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు అదనపు నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్ర్ర ప్రభుత్వం చేపట్టింది.












Click it and Unblock the Notifications