అనంతపురం జిల్లా పర్యటనకు కెసిఆర్, ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహానికి హజరయ్యేందుకు కెసిఆర్ అక్టోబర్ 1వ, తేదిన అనంతపురం.
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహానికి హజరయ్యేందుకు కెసిఆర్ అక్టోబర్ 1వ, తేదిన అనంతపురం వెళ్ళనున్నారని సిఎంఓ వర్గాలు ప్రకటించాయి.
పరిటాల శ్రీరామ్ వివాహం అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరగనుంది. ఈ వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి.
ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో కెసిఆర్ చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారని సిఎంఓ వర్గాలు చెప్పాయి.
ఇక ఇదే వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీంతో వెంకటాపురం గ్రామాన్ని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరి మధ్య ఎటువంటి అధికారిక చర్చలు ఉండవని సమాచారం.