సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఫోన్లు చెక్ చేసుకోండి.. రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతులు తమ ఫోన్లు చెక్ చేసుకోవాలని సూచనలు చేశారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటివరకు లక్ష కోట్లు ఖర్చుచేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటివరకు లక్ష కోట్లు ఖర్చుచేసామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎకరాల వారీగా కాకుండా అర్హులైన వారందరికీ ఒకేసారి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కోటి 49 లక్షల 35 వేల ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతు భరోసాలో ఎలాంటి పరిమితి లేకుండా అర్హులైన ప్రతిరైతుకు రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల్లోనే అందరికీ రైతు భరోసా పూర్తి చేస్తామని తెలిపారు.

రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని.. అన్నదాతలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications