గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు: సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.
సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. గవర్నర్ను కలిసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తమకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ లో ఒక విధానం ఉంటుందని.. ఆ ప్రకారమే ప్రక్రియ ఉంటుందని డీకే శివకుమార్ వివరించారు. కాగా, సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజల తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామన్నారు. ప్రగతి భవన్ ప్రజా భవన్ గా మారుతుందన్నారు. సచివాలయానికి ప్రజలు ఎప్పుడైనా రావచ్చని అన్నారు.
కాగా, కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 31,849 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. కొడంగల్లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు రేవంత్.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications