మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పోలీస్ బాస్ పర్యటన..? వారం రోజుల పాటు టూర్..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అంటే హడల్.. ఇక కింది స్థాయి పోలీసు సిబ్బంది అయితే వణికిపోతారు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యటిస్తుంటారు. ఇక తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అయితే ఏకంగా.. వారం రోజులపాటు పర్యటిస్తానని ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందిలో మరింత మనో ధైర్యం కలుగనుంది.
మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారనే ఊహాగానాల నేపథ్యంలో ప్రాబల్య ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించబోతున్నారు. వారం రోజులు పర్యటిస్తానని స్పష్టంచేశారు. ఫస్ట్ నాలుగు రోజులు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు పరిశీలించారు.
Recommended Video
పోలీసులకు స్వయంగా ఓరియెంటేషన్ క్లాసులను డీజీపీ మహేందర్ రెడ్డి బోధించనున్నారు. డీజీపీ స్థాయి వ్యక్తి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ పర్యటనతో పోలీసుల మనోబలం మరింత పెరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతోపాటు మావోల లొంగుబాటు అంశం కూడా చర్చకు దారితీసింది.