TS EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ నేడే విడుదల
TS EAPCET: బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్ -2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఈఏపీసెట్ ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసి, 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించవచ్చు.

ఇక, మే 1వ తేదీ నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్కు సంబంధించిన 100 శాతం సిలబస్తో టీఎస్ ఈఏపీ సెట్ను కండక్ట్ చేయనున్నారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్ - తెలుగు, ఇంగ్లీష్ - ఉర్దూ భాషల్లో ఉండనుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్లోని ప్రశ్నల్లో తేడాలుంటే ఇంగ్లిష్ వెర్షన్నే ఫైనల్గా తీసుకుంటారు. ఇతర వివరాల కోసం 7416923578, 7416908215 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చని సూచించారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications