హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేడు (మంగళవారం - 11-12-2018) వెలువడినాయి. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ 88, మహాకూటమి 21, మజ్లిస్ 7, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.
కీలక స్థానాలు
గజ్వెల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 58వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసినిపై మాధవరం కృష్ణారావు 43వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కొడంగల్ - రేవంత్ రెడ్డి పైన పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి పైన కేటీఆర్ 58వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.
సిద్దిపేట - హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీతో గెలిచారు.
Dec 11, 2018, 9:30 pm IST
ఖమ్మం జిల్లాలో మహాకూటమి 8 చోట్ల, తెరాస 1చోట, స్వతంత్రులు 1చోట గెలిచారు.
Dec 11, 2018, 9:30 pm IST
వరంగల్ జిల్లాలో 12 సీట్లు ఉండగా తెరాస 10 సీట్లు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది.
Dec 11, 2018, 9:30 pm IST
నల్గొండలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ 3చోట్ల గెలిచింది.
Dec 11, 2018, 9:30 pm IST
మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉండగా తెరాస 13, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించారు.
Dec 11, 2018, 9:30 pm IST
హైదరాబాదులో 15 స్థానాలు ఉండగా తెరాస 7, మజ్లిస్ 7, బీజేపీ 1 స్థానంలో గెలిచింది.
Dec 11, 2018, 9:30 pm IST
రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లు ఉండగా తెరాస 10, కాంగ్రెస్ 3, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.
Dec 11, 2018, 9:30 pm IST
మెదక్ జిల్లాలో పది స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.
Dec 11, 2018, 9:29 pm IST
కరీంనగర్లో 13 స్థానాలు ఉండగా తెరాస 11, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 1చోట గెలిచారు.
Dec 11, 2018, 9:29 pm IST
నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 8 చోట్ల, కాంగ్రెస్ 1 చోట గెలిచింది.
Dec 11, 2018, 9:29 pm IST
అదిలాబాద్ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తెరాస 9 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో గెలిచింది.
Dec 11, 2018, 7:51 pm IST
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు. 800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Dec 11, 2018, 7:26 pm IST
కోదాడ ఫలితం చివరి వరకు ఉత్కంఠను రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుకు డిమాండ్ చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కోదాడలో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి ఓడిపోయారు. 668 ఓట్ల ఆధిక్యంతో తెరాస గెలిచింది.
Dec 11, 2018, 7:15 pm IST
పలు జిల్లాల్లో తెరాస క్లీన్ స్వీప్ సాధించింది.
Dec 11, 2018, 6:24 pm IST
ములుగులో సీతక్క 22వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
Dec 11, 2018, 5:30 pm IST
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఫలితం ఉత్కంఠను రేపుతోంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతోంది. మల్ రెడ్డి రంగారెడ్డి 100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Dec 11, 2018, 5:20 pm IST
కార్వాన్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది.
Dec 11, 2018, 5:20 pm IST
కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు 43వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Dec 11, 2018, 4:25 pm IST
ఆలేరులో గొంగిడి సునీత గెలుపొందారు. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.
Dec 11, 2018, 4:09 pm IST
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 17,750 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెరాస అభ్యర్థి ప్రేమ్ సింగ్ పైన విజయం సాధించారు.
Dec 11, 2018, 3:58 pm IST
గజ్వెల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ 51వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. సిరిసిల్ల నుంచి కేటీ రామారావు 85వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. సిద్దిపేట నుంచి హరీష్ రావు ఒక లక్షకు పైగా ఓట్లతో గెలిచారు.
Dec 11, 2018, 3:32 pm IST
తెరాస గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
Dec 11, 2018, 3:16 pm IST
గజ్వెల్ నియోజకవర్గం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 51వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.
అంబర్ పేట నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓడిపోయారు.
Dec 11, 2018, 3:13 pm IST
కేసీఆర్కు చంద్రబాబు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
Dec 11, 2018, 2:40 pm IST
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్.. కేసీఆర్కు శుభాకాంక్షలు చెప్పారు.
Dec 11, 2018, 2:34 pm IST
మేడ్చల్లో తెరాస అభ్యర్థి మల్లారెడ్డి 80వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు.
Dec 11, 2018, 2:18 pm IST
కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ ఓడిపోయారు.
Dec 11, 2018, 2:12 pm IST
మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరాస 50 స్థానాల్లో ముందంజలో ఉండగా 38 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి 15 స్థానాల్లో ముందంజలో, ఆరు స్థానాల్లో గెలుపు, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో, మజ్లిస్ మూడు స్థానాల్లో ముందంజలో, మూడు స్థానాల్లో గెలుపు సాధించారు.
Dec 11, 2018, 2:10 pm IST
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమి చవి చూశారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, రామచంద్ర రావులు ఓడిపోయారు.
Dec 11, 2018, 2:08 pm IST
ఆందోల్లో దామోదర రాజనర్సింహ ఓడిపోయారు. నర్సాపూర్లో సునితా లక్ష్మీరెడ్డి ఓడిపోయారు. బోధన్లో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. కోదాడలో పద్మావతి ఓడిపోయారు. జనగామలో పొన్నాల లక్ష్మయ్య పరాజయం పాలయ్యారు. పరకాలలో కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. మహబూబాబాద్లో బలరాం నాయక్ ఓడిపోయారు.
READ MORE
3:28 AM, 11 Dec
గత ఎన్నికల్లో (2014) టీఆర్ఎస్ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 21 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో, మజ్లిస్ 6 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్, స్వతంత్రులుగా గెలిచిన వారు 25 మందికి పైగా ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. దీంతో తెరాస బలం 90 వరకు చేరుకుంది.
3:28 AM, 11 Dec
దాదాపు టీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలతో 2018 ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకవేళ గెలిచినా, ఆ సీట్ల కంటే తక్కువగా వస్తే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తేలిపోతుందని అంటున్నారు.
3:28 AM, 11 Dec
ఈసారి బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేసింది. డబుల్ డిజిట్ సాధించాలని ఆశిస్తోంది. కనీసం 8 సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. ఈసారి సీట్లతో పాటు ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుందని ఆశిస్తోంది. మజ్లిస్ కూడా సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో ఉంది.
3:28 AM, 11 Dec
తెలంగాణ సాధించిన తర్వాత అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవి. తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు దానిని నిలబెట్టుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలిచినా సీట్లు మాత్రం కష్టంగానే వస్తాయని భావిస్తున్నారు.
3:29 AM, 11 Dec
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇక్కడ మూడు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ మూడోసారి గెలిస్తే అది వండర్ అవుతుంది. మూడుసార్ల తర్వాత కూడా ప్రజా వ్యతిరేకత తట్టుకొని నిలబడటం సాధారణ విషయం కాదు. కాంగ్రెస్ ఈ చోట్ల గెలవకుంటే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మసకబారుతుందని చెబుతున్నారు. రాజస్థాన్లో ప్రతిసారి కొత్త ప్రభుత్వం వస్తుంది. దానికి తోడు వసుంధరా రాజే పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా బీజేపీకి వచ్చే నష్టం, కాంగ్రెస్కు వచ్చే లాభం లేదని చెబుతున్నారు.
3:31 AM, 11 Dec
లెక్కింపు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉంటుంది. ప్రతి టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వేటర్ ఉంటారు. కౌంటింగ్ పూర్తయ్యాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో రాండమ్ పద్ధతిలో ఏదైనా వీవీప్యాట్ ముద్రిత ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాలను ఆదీనంలోకి తీసుకున్న పోలీసులు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరు.
7:26 AM, 11 Dec
మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. భద్రాచలం, అశ్వారావుపేట ఫలితాలు తొలుత రానున్నాయి. శేరిలింగంపల్లి చివరలో వచ్చే అవకాశముంది.
7:27 AM, 11 Dec
ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏమవుతుందోననే ఆందోళన అందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇలా కనిపిస్తోంది.
#Telangana: Visuals from Congress Office in Hyderabad. Counting of votes to be conducted for the state assembly elections at 8 am today. pic.twitter.com/VtSw6RkID6
తుంగతుర్తి, సిరిసిల్ల, మక్తల్ నియోజకవర్గాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది.
8:29 AM, 11 Dec
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పోటీ చేస్తున్న హుస్నాబాద్, జగిత్యాలలో తెరాస ఆధిక్యంలో ఉంది.
8:31 AM, 11 Dec
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగుచోట్ల తెరాస ఆధిక్యంలో ఉంది. హుజురాబాదులో తెరాస ఆధిక్యంలో ఉంది.
8:38 AM, 11 Dec
హుస్నాబాద్లో తెరాస అభ్యర్థి సతీష్ కుమార్ ముందంజలో ఉన్నారు.
8:51 AM, 11 Dec
ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్లలో తెరాస ఆధిక్యంలో ఉంది. ఎల్లారెడ్డి, కామారెడ్డిలలో తెరాస ఆధిక్యంలో ఉంది. మహేశ్వరంలో సబితా ఇంద్రా రెడ్డి లీడ్లో ఉన్నారు.
8:52 AM, 11 Dec
పాలేరులో తుమ్మల నాగేశ్వర రావు ఆధిక్యంలో ఉన్నారు. బాన్సువాడలో తెరాస ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి హరీష్ రావు 13వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
8:55 AM, 11 Dec
సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ముందంజలో ఉన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
8:56 AM, 11 Dec
గద్వాలలో తెరాస ఆధిక్యంలో ఉంది. తాండూరులోను తెరాస ఆధిక్యంలో ఉంది. వరంగల్ తూర్పులో తెరాస ముందంజలో ఉంది.
8:59 AM, 11 Dec
వనపర్తిలో మొదటి రౌండులో తెరాస ఆధిక్యంలో ఉంది. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. వర్ధన్నపేటలో తెరాస ఆధిక్యంలో ఉంది. నాగర్ కర్నూలులో తెరాస ఆధిక్యంలో ఉంది. జూబ్లీహిల్స్,ఖైరతాబాద్, శేరిలింగంపల్లిల్లో తెరాస ఆధిక్యంలో ఉంది.
8:59 AM, 11 Dec
గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోథ్ ఆధిక్యంలో ఉన్నారు.
9:02 AM, 11 Dec
ఎల్లారెడ్డిలో తొలి రౌండులో కాంగ్రెస్ 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ములుగులో సీతక్క ఆధిక్యంలో ఉంది.
9:03 AM, 11 Dec
తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ మొదటి రౌండులో 48 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
9:06 AM, 11 Dec
నాగార్జున సాగర్లో జానారెడ్డి, గద్వాల్లో డీకే అరుణ, జనగామలో పొన్నాల లక్ష్మయ్యలు వెనుకంజలో ఉన్నారు. సిర్పూర్లో తెరాస మూడువేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
9:08 AM, 11 Dec
ముథోల్, కొల్లాపూర్లలో తెరాస ఆధిక్యంలో ఉంది. నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. కోరుట్లలో తెరాస ఆధిక్యంలో ఉంది. శేరిలింగంపల్లిలో 2300 ఓట్ల ఆధిక్యంలో తెరాస ఉంది. సత్తుపల్లిలో 1700 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఉంది. జహీరాబాదులో 700ఓట్ల ఆధిక్యంలో తెరాస ఉంది.
9:09 AM, 11 Dec
కాంగ్రెస్ ముఖ్యనేత జీవన్ రెడ్డి జగిత్యాలలో వెనుకంజలో ఉన్నారు.
9:10 AM, 11 Dec
కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ముందంజలో ఉన్నారు.
9:14 AM, 11 Dec
మహేశ్వరంలో తెరాస ముందంజలో ఉంది. మేడ్చల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ ముందంజలో ఉన్నారు. 5కు పై చిలుకు ఓట్ల మెజార్టీతో కేసీఆర్ ఉన్నారు. బోధన్, షాద్ నగర్, వైరాలలో తెరాస ముందంజలో ఉంది.
9:14 AM, 11 Dec
హరీష్ రావు మూడో రౌండ్ ముగిసేసరికి దాదాపు 20వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు. కూకట్పల్లిలో తెరాస ముందంజలో ఉంది.
9:17 AM, 11 Dec
శేరిలింగంపల్లిలో 6200 ఓట్ల మెజార్టీతో తెరాస ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 4 సీట్లలో ముందంజలో ఉంది. హరీష్ రావు రికార్డ్ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొన్నాల, గీతారెడ్డి, జీవన్ రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి వంటి కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. మధిరలో భట్టి విక్రమార్క వెనుకబడ్డారు.
9:19 AM, 11 Dec
గోషామహల్, అంబర్ పేటలలో రాజాసింగ్ లోథ్, కిషన్ రెడ్డిలు ముందంజలో ఉన్నారు.
9:20 AM, 11 Dec
కూకట్పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాసిని వెనుకంజలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ ముందంజలో ఉన్నారు. షబ్బీర్ అలీ వెనుకంజలో ఉన్నారు.
9:27 AM, 11 Dec
ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ వెనుకంజలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఆందోల్లో తెరాస అభ్యర్థి క్రాంతి ముందంజలో ఉన్నారు.
Telangana Assemblly elections results 2018. The state went to polls on December 7, when 73.2 per cent polling was recorded. A total of 1,821 candidates contested for 119 assembly seats in Telangana.