సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. వారికి రూ. 5 లక్షలు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదలలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే చనిపోయిన జంతువులకూ పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy Reviews Flood Situation, Orders Swift Relief & Restoration
— IPRDepartment (@IPRTelangana) September 1, 2025
Hon'ble Chief Minister Shri A. Revanth Reddy directed officials to expedite restoration works of damaged roads, buildings, tanks, ponds, and power substations caused by recent heavy rains and floods. He… pic.twitter.com/VrYzSr7vkc
ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయింది. అయితే వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పశువులు మరణిస్తే రైతులకు పరిహారం అందజేస్తామని తెలిపారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. విపత్తుపై సమగ్ర నివేదికను రూపొందించి కేంద్రానికి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

వరదలకు సంబంధించిన పూర్తి వివరాలను తక్షణమే కేంద్రానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాక పంటలకు వచ్చిన నష్టం అంచనా వేయించి.. తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
-
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications