ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు.
ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఏప్రిల్ 15న నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. పలువురిని జైలుకు తరలించారు. కొందరు అధికారులపై సస్పెన్స్ వేటు వేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ ఏమన్నారంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. తొలిసారి ఈ కేసుపై స్పందించిన ఆయన.. కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమపద్ధతిలో సాగుతోందని సీపీ శ్రీనివాస్ తెలిపారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారా? అని సీపీని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications