రైతు భరోసా నిధులు విడుదల ముహూర్తం - ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
రైతులకు బిగ్ అప్డేట్. రైతు భరోసా నిధుల పైన ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందు తోంది. రైతులకు సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తారని తొలుత భావించా రు. అయితే, ఇప్పుడు కొత్త అప్డేట్ అందుతోంది. అదే సమయంలో రైతు భరోసా అమలు.. అర్హత పైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్దిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. కాగా.. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం యాసింగి సీజన్ కొనసాగుతోంది. రైతు భరోసా నిధుల కోసం రైతాంగం వేచి చూస్తోంది. సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుందని అందరూ భావించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిధుల జమ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దీంతో.. రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టత ఇచ్చారు.
జనవరి నెలాఖరు లోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతులకు త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని, నీటి వినియోగం తక్కువా ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం ప్రయోగత్మకంగా మూడు గ్రామాల్లో కూరగాయల సాగు చేశారని, ఇది విజయవంతమైందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ విధానం పాటించాలని సూచించారు.
కాగా.. పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమై రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం అన్నీ భూములకు రైతు భరోసా ఇచ్చిందని, తమ ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నట్ల తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే చేయించి.. ఆ నివేదిక ఆధారంగా పంట సాగు చేస్తున్న భూములను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించారు.
-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications