గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ: సినీ ఫక్కీలో మంకీక్యాప్స్, గ్యాస్ కట్టర్లతో రూ. 3.5 కోట్ల చోరీ
నిజామాబాద్: జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 3.5 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. నిన్న ఆదివారం కావడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది.
బ్యాంక్ లాకర్లలోని రూ.7.22 లక్షలు, రూ.2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు దొంగలు అపహరించారు. శనివారం రాత్రి చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చోరీ జులాయి సినిమాలో బ్యాంక్ చోరీ సంఘటనను తలపించేలా చోటు చేసుకోవడం గమనార్హం.

మొదట బ్యాంక్ షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించిన దొంగలు సీసీటీవీ కెమెరాల వైర్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో లాకర్లను తెరిచి నగదుతోపాటు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రత్యేక క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మంకీని పోలిన మాస్కులు ధరించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సమీపంలోని సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ భారీ బ్యాంక్ చోరీ స్థానికంగా కలకలంగా మారింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications