17 నుంచి కాలేజీలకు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ
హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు నెలాఖరు వరకు కూడా విద్యాసంస్థలు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆన్లైన్ తరగతులు జరిగినా సరే ఆగస్టు నెలాఖరు వరకు విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

అంతకుముందు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న స్టాఫ్ అందరూ కాలేజీకి రావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది కళాశాలలకు హజారు కావాలని ముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అడ్మిషన్స్ మీద కూడా లెక్చరర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
ఇది ఇలా వుండగా, కరోనా కేసులు తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 88,396 కరోనా కేసులు నమోదయ్యాయి. 23,438 యాక్టివ్ కేసులున్నాయి. 64,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 674 మంది మరణించారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications