కేంద్రమంత్రి స్థానంలో ఉండి అవాస్తవాలు చెబుతారా?: అమిత్ షాపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవాస్తవాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు మనసు రావడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆక్షేపించారు.
వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రిస్థాయికి తగదని కేటీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని అమిత్ షాకు గుర్తు చేయడంతోపాటు అందుకు సంబంధించిన పలు వార్తా కథనాలను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.

సెప్టెంబర్ 17పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ.. భారతదేశంలో కలిసిపోయినప్పటి నుంచి సెప్టెంబర్ 17ను జాతీయ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
To those who ask why can’t we call it Liberation Day;
— KTR (@KTRBRS) March 27, 2023
Why do we celebrate 15th August as Independence Day and not as Liberation Day?
What should matter is respectful commemoration of the sacrifices & struggles against oppressors; be it the British or Nizam
“Stop being a…
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని అడుగుతున్నవారు.. ఆగస్టు 15ను దేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఎందుకు నిర్వహిస్తున్నామో ఆలోచించాలని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను, పోరాటాలను గౌరవ ప్రదంగా స్మరించుకోవడానికి బదులుగా.. గతించిన కాలానికి ఖైదీగా బంధీ కావడం మంచిది కాదన్నారు.
వివాదాలకు పక్కనపెట్టి, భవిష్యత్ నిర్మాణంపై దృష్టి సారించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం నుంచి విముక్తి పొందిన క్రమంలో విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. దేశంలో విలీనమైన నేపథ్యంలో సమైక్యతా దినోత్సవం జరుపుతున్నామని అధికార బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications