కు.ని ఆపరేషన్ చేయించుకున్న మరో మహిళ మృతి, వైరల్ ఫీవరేనంటూ అధికారులు
హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్ చేయించుకున్న మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ నగరంలోని పేట్లబురుజు ఆస్పత్రిలో రెండ్రోజుల క్రితం ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం మహిళకు వాంతులు, విరోచనాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
అయితే, ఆ మహిళ మృతి ఘటనపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బందితో చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేట్లబురుజు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ వైరల్ ఫీవర్ వల్లే మృతి చెందారని తెలిపారు.

ఆ మహిళకు ఆపరేషన్ జరిగిన రోజే ఆస్పత్రిలో మరో 9 మందికి శస్త్రచికిత్స చేశారని, వీరిలో మరో ఇద్దరు మహిళలకు కూడా వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పారు. జ్వరం వచ్చిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు.
కాగా, ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి ఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications