నల్గొండ కాల్పులపై నాయిని: అదేం ప్రకటన.. ఆగ్రహం
హైదరాబాద్: నల్గొండ జిల్లా ఎన్కౌంటర్ అంశంపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర హోంమంత్రి నాయిని ప్రకటనను మండలిలో కాంగ్రెస్ పక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం ఆక్షేపించారు.
దుండగులు దొంగల ముఠాకు చెందిన వారేనని, ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు కాదని హోంమంత్రి మాట్లాడటం సరికాదన్నారు. హోంమంత్రి ప్రకటనను డీజీపీ సైతం సమర్థించినట్లుగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నాయిని వ్యాఖ్యల పైన భారతీయ జనతా పార్టీ, టీడీపీలు కూడా విమర్శలు గుప్పించాయి.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. నాయిని వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు దొంగల ముఠాకు చెందిన వారేనని చెప్పడం విడ్డూరమన్నారు. నాయిని నర్సింహా రెడ్డిది నిర్లక్ష్యం ప్రకటన అన్నారు.
టీడీపీ నేతలు ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరిగారు. పోలీసులు బాగా పని చేశారని టీడీపీ నేతలు కితాబిచ్చారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రత్యేక బృందాన్ని పంపిస్తే మరింత బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే ఇంత నష్టం జరగకపోయి ఉండేదన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications