సర్పంచ్ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగింది. ఈ విడతలో మొత్తం 85.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో అయితే అతి తక్కువగా అంటే 76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
ఇప్పటివరకూ పోలింగ్ ఫలితాలను చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం స్థానాలు 4,332 కాగా.. ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించినవి 3,701 స్థానాలు. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 1900 లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ మద్దతుదారులు 1000కు పైగా స్థానాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ 217 సీట్లలో విజయం సాధించింది. అలాగే ఇతరులు 548 స్థానాల్లో విజయం సాధించారు.
అయితే కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికను వెంటనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయి తేనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టుగా భావించాలి.

ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలు రెండో విడతలోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమిష్టిగా కష్టపడ్డారని తెలిపారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసే దిశగా సర్కారు ముందుకు సాగుతోందని అన్నారు.
మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభ్యర్థి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నగోని కాటంరాజు 251 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు . దీంతో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications