'ముందస్తు' లేకుండానే ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, మరో భేటీలో 'కీలక' నిర్ణయం
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి నివేదన సభకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని జోరుగా చర్చ సాగింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై ఊహించని నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ అలాంటి అంశాలు లేకుండానే కేబినెట్ భేటీ ముగిసింది. దీంతో సభలో ఏం చెప్తారనే ఉత్కంఠ ఉంది.
కేబినెట్ భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం చెప్పారు. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ జరగనుందన్నారు. ఆ కేబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
బీసీలకు హైదరాబాద్లో 70 కోట్లతో 71 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ఈటెల చెప్పారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కోసం మరో ఐదు ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంపు, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్యూహెచ్ఎంలో పని చేస్తున్న తొమ్మిది వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ.40 వేలకు పెంపు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications