తెలంగాణ ఎన్నికలు: రాహుల్ పెద్ద తప్పు చేశారా? భారీ మూల్యం తప్పదా?, నేతల్లో కలవరం
హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, రాహుల్ గాంధీ తాజాగా తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అంసతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

ఒక్క తెలంగాణ నేత కూడా లేడు
రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తీసుకుని పెద్ద చేశారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అసలుకు ఆ నిర్ణయం ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థు ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో ఒక్క తెలంగాణ నేతకు కూడా చోటు కల్పించకపోవడం గమనార్హం.

ముగ్గురూ ఇతర రాష్ట్రాలకు చెందినవారే
ముగ్గురు సభ్యుల ఆ కమిటీ విషయానికొస్తే.. భక్త చరణ్ దాస్(ఏఐసీసీ సెక్రటరీ-ఒడిశా), 2. జోతిమని సెన్నిమలై (తమిళనాడుకు చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ సభ్యులు, రాహుల్ గాంధీ సన్నిహితులలో ఒకరు'), 3. షర్మిష్ట ముఖర్జీ(పశ్చిమబెంగాల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు) .

రాహుల్ పెద్ద తప్పు చేశారా?
కమిటీలో నియమితులైన ముగ్గురు సభ్యులు కూడా తెలంగాణకు చెందిన వారు కాకపోవడంతో స్థానిక తెలంగాణ నేతలు రాహుల్ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఈ ముగ్గురికీ కూడా తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో రాహుల్ గాంధీ వీరిని నియమించి పెద్ద తప్పు చేశారని భావిస్తున్నారు.

ఎలా గెలుస్తారు?
‘ఢిల్లీ నుంచి రావాల్సిన ఈ కమిటీలోని నేతలకు తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదు. ఇలాంటి వారు తెలంగాణలోని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు?' అని హైదరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇలాంటి నిర్ణయాలు సరికావని అన్నారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేయకపోతే ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ప్రశ్నించారు.

భారీ మూల్యం తప్పదు?
కాగా, తెలంగాణ రాజకీయాలపై మంచి పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి, వీరప్ప మొయిలీ లాంటి నేతలకు ఈ బాధ్యతలను అప్పగించివుంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని తెలంగాణకు ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస పొరపాటు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications