పెట్టుబడులతో రండి: ద. కొరియాలో మంత్రి కేటీఆర్ బిజీ(పిక్చర్స్)
దక్షిణ కొరియా పరిశ్రమలు తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించడం కోసం రాష్ట్రంలో కొరియన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: దక్షిణ కొరియా పరిశ్రమలు తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించడం కోసం రాష్ట్రంలో కొరియన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న కేటీఆర్ అక్కడి పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించటంతో పాటు సామ్సంగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
సామ్సంగ్ ప్రతినిధులతో భేటీ
మంత్రి కేటీఆర్ గురువారం శామ్సంగ్ కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షుడు సంగ్ మో యిమ్, ఉపాధ్యక్షుడు పీటర్ రీలతోభేటీ అయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ అవకాశాలపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు కల్పిస్తున్న వౌలిక వసతులు, ప్రత్యేక పారిశ్రామిక విధానం గురించి కెటిఆర్ వివరించారు.
మ్యూజియం సందర్శన..
తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైజ్ మాన్యుఫాక్చరింగ్ పార్క్లో యూనిట్ ఏర్పాటు చేయాలని శామ్సంగ్ సంస్థ ప్రతినిధులను కెటిఆర్ కోరారు. అనంతరం శామ్సంగ్ ఇన్నోవేషన్ మ్యూజియాన్ని కెటిఆర్ సందర్శించారు.
కేటీఆర్ ప్రసంగం
భారత చాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ కొరియా ఏర్పాటుచేసిన వ్యాపారవేత్తల సమావేశంలో కెటిఆర్ ప్రసంగించారు. సియోల్లో జరిగిన ఈ సమావేశానికి వందకు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల అంశాలు, ప్రభుత్వ విధానాలపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, లైఫ్ సైనె్సస్, ఆటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్వంటి రంగాల్లోని సంస్థలకు ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న అవకాశాలు, సౌకర్యాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని కెటిఆర్ వివరించారు.
పూర్తి సహకారం
కొరియాలోని భారత రాయబారి విక్రం దొరైస్వామి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని కెటిఆర్ తెలిపారు.