గులాబీవనంలో కవిత సెల్ఫీ: ఛీఛీ అన్నా(పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం జరిగిన తెరాస బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో మరోసారి ఉత్సాహాన్ని నింపాయి. తెరాస శ్రేణులతో సికింద్రాబాద్ కిక్కిరిసిపోయింది. పరేడ్ మైదానం నిండిపోవడంతో చాలామంది ప్రజలు రహదారి పైన నిలబడ్డారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి తండోపతండాలుగా ప్రజలు కదలి వచ్చారు. గులాబీ దళాల గర్జనతో సికింద్రాబాద్ మార్మోగింది. 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బహిరంగ సభ జరిగింది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు హైదరాబాదు నగరం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.
మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈ సభలో సీఎం కేసీఆర్ నేపాల్ ఘోర కలిపై స్పందించారు. ఆ దేశానికి అన్ని రకాలుగా సాయపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నేపాల్కు ఏవిధంగా సాయం చేయాలో అడిగి తెలుసుకుంటామని, అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వెళ్లేందుకు ప్రభుత్వ సిబ్బంది ఉందన్నారు. కేసీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన కిరికిరి నాయుడు అంటూ ధ్వజమెత్తారు.

బహిరంగ సభ
కిరికిరి నాయుడు ఛీ పొమ్మన్నా పోడు, ఆయనకో రాష్ట్రం ఉంది, రాజ్యం ఉంది, అక్కడి సమస్యలు పరిష్కరించలేక మన రాష్ట్రంలో ప్రతి దానికి కిరికిరి పెడుతున్నాడని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ అన్నారు.

బహిరంగ సభ
బాబుకు అక్కడ దిక్కులేదని, చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదని, డ్వాక్రా మహిళలకు రైతులకు రుణ మాఫీ అని చెప్పి గోల్ మాల్ చేశాడని ఆరోపించారు.

బహిరంగ సభ
తాము మాత్రం తెలంగాణలో చిత్తశుద్ధితో రుణమాఫీ అమలు చేశామని, ఆంధ్రలో అన్నీ అబద్ధాలే అన్నారు. సగం మందిని రుణమాఫీ జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.

బహిరంగ సభ
డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలేనని, మీడియా మేనేజ్మెంట్ తప్ప అక్కడ ఏమీ లేదని విమర్శించారు.

బహిరంగ సభ
కేసీఆర్ గుండెల్లో నిద్రపోతాను అంటున్నాడు కన్నతల్లికి అన్నపెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాను అన్నట్టు తన రాష్ట్రంలో ఏమీ చేయలేని వాడు మహబూబ్నగర్లో ఏదో మాట్లాడుతున్నాడని విమర్శించారు.

బహిరంగ సభ
చంద్రబాబు నాలుగు పెంపుడు కుక్కలు ఏవో మొరుగుతున్నాయని అన్నారు. సికిందరాబాద్లో ఈ రోజు బహిరంగ సభలో బఠాణీలు అమ్మడానికి వచ్చినంతమంది కూడా బాబు మహబూబ్నగర్ సభకు రాలేదు.

బహిరంగ సభ
దానికే ఏదో చేసేసినట్టు బాబు హడావుడి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని కోరితే రాజధాని నగరంలో రైతులను కాల్చి చంపిన వారు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

బహిరంగ సభ
మహబూబ్నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం, నల్లగొండలో నక్కల గండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు.

బహిరంగ సభ
భాగ్యనగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం జరిగిన తెరాస బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో మరోసారి ఉత్సాహాన్ని నింపాయి.

బహిరంగ సభ
తెరాస శ్రేణులతో సికింద్రాబాద్ కిక్కిరిసిపోయింది. పరేడ్ మైదానం నిండిపోవడంతో చాలామంది ప్రజలు రహదారి పైన నిలబడ్డారు.

బహిరంగ సభ
తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి తండోపతండాలుగా ప్రజలు కదలి వచ్చారు. గులాబీ దళాల గర్జనతో సికింద్రాబాద్ మార్మోగింది.

బహిరంగ సభ
14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బహిరంగ సభ జరిగింది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు హైదరాబాదు నగరం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.

బహిరంగ సభ
ఈ సభలో సీఎం కేసీఆర్ నేపాల్ ఘోర కలిపై స్పందించారు. ఆ దేశానికి అన్ని రకాలుగా సాయపడతామని చెప్పారు.

బహిరంగ సభ
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నేపాల్కు ఏవిధంగా సాయం చేయాలో అడిగి తెలుసుకుంటామని, అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వెళ్లేందుకు ప్రభుత్వ సిబ్బంది ఉందన్నారు. కేసీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన కిరికిరి నాయుడు అంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications