తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ వేడుకలు పబ్లిక్గార్డెన్స్లో..
సాంప్రదాయాలకు విరుద్దంగా, ఇప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆద్యుడు అని చెప్పవచ్చు...తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటు తర్వాత పరిపాలనతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయ నిర్ణయాలు ఎవ్వరు ఊహించని విధంగా ఉంటాయి. ఇందులో భాగాంగానే స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కోండలో నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో పాటు దేశంలోనే జాతీయ జెండాను సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసి అన్ని ఇతర రాష్ట్ర్రాలకు ఆదర్శప్రాయుడయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్లో కాకుండా పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సారీ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర్ర అవతరణ వేడుకలు...
ఇక రాష్ట్ర్ర అవతరణ దినోత్సవ వేడుకలతో పాటు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను కూడ పబ్లిక్ గార్డెన్స్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అయితే ఆప్రాంతం ఎప్పుడు బీజీగా ఉండడంతో పాటు రైల్వే స్టేషన్ కూడ ఉండడంతో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో అక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటీ పరిస్థితిలో ప్రజలకు ఆసౌకర్యంగా కల్పించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అవతరణ వేడుకల్లో కూడ మార్పు
జూన్ 2న అవతరణ దినోత్సవాల్లో ఏర్పాటు చేసే కవాతును కూడ సీఎం రద్దు చేశారు.ఎండలు తీవ్రంగా ఉండడంతో వాటిని రద్దు చేశారు. ఈనేపథ్యంలోనే ఉదయం 9 గంటల నుండి 10.30 నిమిషాలవరకే వేడుకలు నిర్వహించాలని పేర్కోన్నారు. ఇక వేడుకల్లో భాగంగా ముందుగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 9 గంటలకు జెండా అవిష్కరణ ఉంటుంది.ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రసగిస్తారు. 10.30 గంటలకు సీఎస్ అధ్యర్యంలో కొనసాగే ఎట్ హోం కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం జూబ్లీహాల్లో కవిసమ్మేళనం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర్ర వేడుకల వేదికలు మార్పు
తెలంగాణ ముఖమంత్రి రాష్ట్ర్ర అవతరణ వేడుకలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2 నిర్వహించనున్న రాష్ట్ర్ర అవిర్భావ వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా వేడుకలపై సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులోభాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు