నేను లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, నేను చెప్తేనే మహాతల్లి నిర్ణయం: జైపాల్ రెడ్డి
మహబూబ్నగర్: గత యుపిఎ ప్రభుత్వంలో తాను కేంద్ర మంత్రిగా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను నచ్చజెప్పానని, దాంతోనే తెలంగాణపై ఆ మహాతల్లి నిర్ణయం తీసుకున్నారనే విషయం తనకు తెలుసని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి వెల్లడించారు.
సోమవారం మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులను రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చేపట్టిన ధర్నాకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు జైపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సందర్భంలో తనతో పాటు సోనియాగాంధీ దగ్గరకు వెళ్లినప్పుడు తెలంగాణ వచ్చాక సిఎంగా నీవే ఉండాలని చెప్పారని, అయితే అందుకు తాను ముందు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పానని వెల్లడించారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులను అవలంభిస్తోందని ఆరోపించారు. కెసిఆర్ సిఎంగా ప్రమాణఁ చేసినప్పటి నుండి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పరిపాలన తొందరపాటు నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు ప్రజల నుండి తిరుగుబాటు, దాంతో తోక ముడుచుకుని తిరోగమనం పడుతున్నారని అన్నారు.
కెసిఆర్కు తెలివి ఎంత ఉందో తిక్క కూడా అంత ఉందని విమర్శించారు. సెక్రటరీయేట్లో ఐఎఎస్లు, ఐపిఎస్లు, మంత్రివర్గ సమావేశాలు జరిగితే ఏ ఒక్కరిని కూడా మాట్లానివ్వకుండా గంటల తరబడి సిఎం ఒక్కరే మాట్లాడుతూ తానే విజ్ఞాన సరస్వం ఉన్న వాడినని అనుకుంటాడని, అది అధికార అహంకారం, దురంకారంతో కూడిన ప్రవర్తన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ ఏ విధంగా అహంకారంగా వ్యవహరిస్తున్నారో అది అంటువ్యాధిగా మారి టిఆర్ఎస్ నాయకులందరికీ వ్యాపించిందని దుయ్యబట్టారు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి కరువు దుర్భిక్షం చూడలేదని, 1969లో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పటివరకు ఇలాం టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏనాడూ చూడలేదని వ్యాఖ్యా నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్కు రైతులు అంటే చిన్నచూపు అని, అందుకే ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదంటే ఎంత అహంకారం ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని జైపాల్రెడ్డి అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications