Dharani: రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఇక భూ సమస్యలకు సత్వర పరిష్కారం..
ధరణిపై రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. తాజాగా ధరణి మార్గదర్శకాలను విడుదల చేసింది. ధరణి సమస్యల పరిష్కార అధికారాలను కింది స్థాయి అధికారులకు బదలాయించింది. ఆర్డీవో, తహసీల్దార్లకు అధికారులు బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారులు ఉంటాయో కూడా మార్గదర్శకాల్లో పొందుపరిచింది. గతంలో భూ సమస్యలు వస్తే కలెక్టర్ స్థాయి నుంచి పరిష్కారానికి అవకాశం ఉండేది.
దీంతో చాలా భూ సమస్యలు రావడం.. అవన్నీ కలక్టర్లే పరిష్కరించాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కింది స్థాయి అధికారులకు అధికారం లేకపోవడంతో చిన్న సమస్య అయినా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమస్య పరిష్కార అధికారాలను కింద స్థాయి అధికారులకు బదలాయించారు. దీంతో తహసీల్దార్లు, ఆర్టీవోలు కూడా ధరణిలో పరిష్కారాలు చేయనున్నారు. దీంతో రైతులు సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి.

ధరణి తీసుకొచ్చిన నుంచి రైతుల భూ సమస్యలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ధరణిపై అనేక ఆరోపణలు చేసింది. అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ధరణిలో మార్పులు చేస్తున్నారు. భూ భారతి తీసుకొస్తామని చెప్పినా.. ఆ దిశ చర్యలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications